Posted by CityPolice-Admin on 2026-03-24 13:15:55 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
రద్దీ నియంత్రణలో భాగంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఓ దేవాలయం వద్దకు వచ్చిన వాహనాలు, భక్తుల లెక్కలను తీస్తూ..
ఆలయాలు, ప్రార్ధన మందిరాల్లో తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా సమూహ నిర్వహణ (క్రౌడ్ మేనేజ్ మెంట్) కోసం రియల్టైం మౌంటింగ్ కెమెరాల్ని వినియోగిస్తున్నారు. పర్వదినాలు, జాతరలు, ఉత్సవాల్లో ఆలయాలు, ప్రార్థన మందిరాలకు వచ్చే వాహనాలు, మనుషుల్ని ఈ కెమెరాలు ఏఐ సాయంతో రియల్దేటైంలో లెక్కిస్తాయి. దాని ఆధారంగా అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
ఫలితం: గతేడాది దుర్గగుడి దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ సమయాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుఁ, ఒకేసారి రద్దీ పెరగకుండా చూశారు. ఆలయం వద్ద ఏ సమయంలో భక్తుల రద్దీ ఎంత ఉంది? అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతుంది? క్యూలైన్లలో ఇంకా ఎంతమంది ఉన్నారు? తదితర వివరాల్ని కచ్చితంగా అంచనా వేయగలిగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగానూ దీన్ని వినియోగించారు. నగరంలోని 200కు పైగా ఆలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.