Posted by pallavi on 2024-09-13 12:14:56 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 89
వియత్నాం: వియత్నాంలో యాగి తుపాను తీవ్రమైన పర్యావరణ మార్పులను తెస్తోంది. కొండచరియలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా 141 మంది మృతిచెందారు. మరో 59 మంది గల్లంతయ్యారని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్కు, 45 మంది లావో కై ప్రావిన్స్కు, 37 మంది యెన్ బాయి ప్రావిన్స్కు చెందినవారు ఉన్నారు.
క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే డైక్ నదిలో భారీ వరద నీటిపోటు కారణంగా పొంగిపోచ్చి, తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు మంగళవారం ధ్రువీకరించారు. రాజధాని హనోయిలోని రెడ్ రివర్ పై వరద స్థాయిలు మూడో స్థాయి హెచ్చరికలను దాటాయని, బుధవారం మధ్యాహ్నానికి అత్యధిక స్థాయికి చేరుకుంటాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటియోరోలాజికల్ ఫోర్కాస్టింగ్ అంచనా వేసింది.
బుధవారం ఉదయం థావో నది నీటి మట్టం పెరిగి, దాని సమీప ప్రాంతాలలో వరదలు పోటెత్తుతాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటియోరోలాజికల్ ఫోర్కాస్టింగ్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాదిలోని నదులపై వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ప్రాంతాలలో లోతట్టు, నదీతీర ప్రాంతాలలో వరదలు ఎక్కువగా ఉన్నాయని, పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది.