అమరవీరుల దినోత్సవం

History Indian History

Posted by Saikiran on 2024-01-31 11:23:21 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 59


అమరవీరుల దినోత్సవం

మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించేందుకు (భగత్​సింగ్​, శివరామ్​ రాజ్​గురు, సుఖ్​దేవ్​ థాప్​ అనే ముగ్గురు వీర స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటీష్​ వారు ఉరితీసిన రోజు మార్చి 23, అలాగే మహాత్మాగాంధీ జ్ఞాపకార్థం జనవరి 30ని) అమరువీరుల దినోత్సవం లేదా షాహిద్​ దివస్​గా పాటిస్తారు. 

  • జాతిపిత మహాత్మాగాంధీని 1948 జనవరి 30న సాయంత్రం ప్రార్థనల సమయంలో నాథూరామ్​ గాడ్సే బిర్లా హౌస్ లో హత్య చేయగా, బాపూ తుది శ్వాస విడిచి అమరవీరుడయ్యారు.
  • భారత ప్రభుత్వం ఈ రోజును గాంధీజీ భారతదేశ స్వాతంత్ర్యానికి చేసిన త్యాగాన్ని, భారతదేశం సంక్షేమం, అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తు చేసుకోవడానికి షహీద్​ దివస్​ లేదా అమరవీరుల దినోత్సవంగా రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరుపుతుంది.
  • అలాగే దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి 1915, జనవరి 9న గాంధీ వచ్చిన రోజును ప్రవాసీ భారతీయ దివస్​గా ప్రతి సంవత్సరం జనవరి 9న భారతదేశ అభివృద్ధిలో విదేశీ భారతీయులు సహకారాన్ని గుర్తు చేసుకుంటారు. 
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి రాజ్​ఘాట్​లో మహాత్మాగాంధీ సమాధి వద్ద బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయుధ దళాల సిబ్బంది, ఇంటర్​ సర్వీసెస్ బృందం కూడా గౌరప్రదమైన వందనం/ నివాళులు అమరవీరులకు సమర్పిస్తుంది.

Search
Categories