తెలుగుదేశం పార్టీ - పేదరికాన్ని నిర్మూలించడంలో వాగ్దానం

మన పార్టీ పార్టీ సిద్ధాంతం

Posted by pallavi on 2024-09-16 07:32:14 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 374


తెలుగుదేశం పార్టీ - పేదరికాన్ని నిర్మూలించడంలో వాగ్దానం

తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్థాపించిన ఈ పార్టీ, పేదరిక నిర్మూలనకు సంబంధించిన సిధ్ధాంతంలో నమ్మకం ఉంచింది. "సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు" అన్న నినాదం ద్వారా, ఎన్టీఆర్ సమాజానికి సేవ చేయడమే నిజమైన రాజకీయం అని పేర్కొన్నారు. వారి ముఖ్య సిద్ధాంతం ప్రకారం, పేదరికాన్ని నశింపజేయడం మరియు సామాజిక అసమానతలను తొలగించడం తెలుగు ప్రజల కోసం ముఖ్యమైన లక్ష్యమైంది.

తెలుగుదేశం పార్టీ, పేదలకు తిండి, గుడ్డ, నీటి వంటి ప్రాథమిక అవసరాలను అందించడమే కాకుండా, అభివృద్ధి కార్యక్రమాలతో వారి జీవన ప్రమాణాలను పెంపొందించడంలో కూడా విశేష కృషి చేసింది. పేదరికాన్ని నిర్మూలించడమే కాకుండా, ఉద్యోగ అవకాశాలు, విద్య, మరియు ఆరోగ్య సౌకర్యాలు అందించడం ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఇది పేదలను పటిష్టమైన సమాజం ఒక భాగంగా మారుస్తూ, వారి హక్కులను రక్షించి, మరింత సమానమైన అవకాశాలను కల్పించడానికి ముక్యమైన పాత్ర పోషించింది. ప్రజలందరూ న్యాయం పొందే సమాజాన్ని ఏర్పాటు చేయడం, దేశానికి నిజమైన స్వాతంత్య్రం అందించడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం.