ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.65%కి చేరింది

బిజినెస్ బిజినెస్

Posted by pallavi on 2024-09-13 19:41:16 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 136


ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.65%కి చేరింది

కూరగాయలు, పప్పుల ధరలు పెరగడంతో ఆగస్టు నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.65 శాతానికి చేరింది. జూలైలో ఇది ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయి 3.6 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. పెరిగినప్పటికీ, ఆర్‌బీఐకు ప్రభుత్వం నిర్దేశించిన కట్టడి పరిధి 4 శాతం లోపే ఉంది. గత ఏడాది ఆగస్టులో ఇది 6.83 శాతం ఉంది. జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఆగస్టు నెలలో కూరగాయల ధరలు 10.71 శాతం, పప్పుల ధరలు 13.6 శాతం పెరిగాయి. సSugంధ ద్రవ్యాలు (-4.4 శాతం) మరియు ఆయిల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ (-0.86 శాతం) విభాగాల్లో ధరలు తగ్గాయి. మొత్తం మీద, ఆహార వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం 5.66 శాతం గా నమోదైంది.

Search
Categories