భారతదేశం: ప్రాచీన విజ్ఞానాన్ని ప్రతిబింబించే అపూర్వ గ్రంథాలు

నవ్య నవ్య

Posted by pallavi on 2024-09-13 20:17:38 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 50


భారతదేశం: ప్రాచీన విజ్ఞానాన్ని ప్రతిబింబించే అపూర్వ గ్రంథాలు

భారతదేశం అనేది విజ్ఞాన ఖని. వేల సంవత్సరాల క్రితమే అనేక మహనీయులు మనుషుల ప్రయోజనానికి అనేక ఆవిష్కరణలు చేశారు. వారు సాధించిన జ్ఞానాన్ని, పాఠాలను తదుపరి తరాలకు అందించేందుకు గ్రంథాలు రచించారు. అయితే, విదేశీయుల ఆక్రమణలు, భద్రపరచడంలో నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వల్ల కొన్ని అపూర్వ గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని ముఖ్యమైన ప్రాచీన గ్రంథాలు:


- అక్షర లక్ష: రచయిత వాల్మీకి మహర్షి. ఈ గ్రంథం వివిధ శాస్త్రీయ అంశాల సమాహారముగా ఉంది. ఇందులో రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక శాస్త్రం, ఖనిజ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, భూగర్భశాస్త్రం, ఉష్ణం కొలిచే పద్ధతులు వంటి 325 రకాల గణిత ప్రక్రియలు వివరించబడ్డాయి.


- శబ్ద శాస్త్రం: రచయిత ఖండిక ఋషి. ఇందులో సృష్టిలోని అన్ని రకాల శబ్దాలు, ప్రతిధ్వనుల గురించి, కృత్రిమ శబ్దాల సృష్టి, వాటి స్థాయి, వేగాలను కొలవడం వంటి అంశాలు ఐదు అధ్యాయాల్లో చర్చించబడ్డాయి.


- శిల్ప శాస్త్రం: రచయిత కశ్యప ముని. 22 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథంలో 307 రకాల శిల్పాలు, 101 రకాల విగ్రహాలు గురించి చర్చించారు. ఆలయాలు, రాజభవనాలు, చావడులు వంటి నిర్మాణాలు గురించి కూడా వివరించారు.


- సూప శాస్త్రం: వంటలతో సంబంధం ఉన్న ఈ శాస్త్రం రచయిత సురేశుడు. ఇందులో 108 రకాల వ్యంజనాలు, పిండివంటలు, తీపి పదార్థాలు, 3,032 రకాల పదార్థాల తయారీ గురించి వివరించబడింది.


- మాలినీ శాస్త్రం: రచయిత ఋష్యశృంగ మహర్షి. పూల మాలలు, పూల గుత్తులు, పూలతో శిరోజాలంకరణలు, రహస్య భాషలో ప్రేమ సందేశాలు పంపడం వంటి విషయాలు ఇందులో 16 అధ్యాయాల్లో ఉన్నాయి.


- ధాతు శాస్త్రం: రచయిత అశ్వనీకుమార. మిశ్ర లోహాలు, కృత్రిమ లోహాలు, లోహాలను మార్చడం, రాగాన్ని బంగారంగా మార్చడం వంటి విషయాలు ఏడు అధ్యాయాల్లో వివరణాత్మకంగా వివరించారు.


- చిత్రకర్మ (చిత్రలేఖన) శాస్త్రం: 12 అధ్యాయాలున్న ఈ గ్రంథం రచయిత భీముడు. ఇందులో 200 కాల చిత్ర లేఖన ప్రక్రియలు మరియు వ్యక్తుల బొమ్మలు గీయడం గురించి వివరించారు.


- మల్ల శాస్త్రం: రచయిత మల్లుడు. వ్యాయామాలు, ఆటలు, 24 రకాల ఉత్త చేతులతో చేసే విద్యల గురించి ఈ గ్రంథంలో వివరించబడింది.


- రత్న పరీక్ష: వాత్సాయన ఋషి రాసిన ఈ గ్రంథంలో 24 రత్న లక్షణాలు, 32 శుద్ధత పరీక్షా పద్ధతులు చర్చించబడ్డాయి.


- మహేంద్రజాల శాస్త్రం: రచయిత వీరబాహువు. నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి భ్రమలను కల్పించే గారడీలను నేర్పుతుంది.


- అర్ధ శాస్త్రం: రచయిత వ్యాసుడు. ఇది మూడు భాగాలుగా విభజించబడింది. ధర్మబద్ధమైన 82 సంపాదనా మార్గాలను ఇందులో వివరించారు.


- శక్తితంత్రం: రచయిత అగస్త్యముని. సూర్య చంద్రులు, ప్రకృతి, అగ్ని, గాలి వంటి 64 రకాల బాహ్య శక్తుల వినియోగం గురించి, అణువిచ్ఛేదన వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.


- సౌదామినీ కళ: రచయిత మతంగ ముని. నీడలు, ఆలోచనలు, భూమి, పర్వతాల లోపలి భాగాలను ఆకర్షించే విధానం గురించి వివరించబడింది.


- మేఘ శాస్త్రం: రచయిత అత్రి ముని. 12 రకాల మేఘాలు, 12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు, 33 రకాల పిడుగుల గురించి వివరించారు.


- స్థాపత్య విద్య: అధర్వణ వేదంలో ఉన్న ఈ శాస్త్రం, ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, కట్టడాలు, నగర ప్రణాళిక వంటి నిర్మాణ సంబంధమైన అన్ని వివరాలను అందిస్తుంది.

Search
Categories