Posted by pallavi on 2024-09-13 20:26:17 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 36
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సహాయం కోసం ప్రభుత్వాల పిలుపు మేరకు పలువురు సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించారు. ఈ విరాళాలను రాష్ట్ర ముఖ్యమంత్రులకు అందించే క్రమంలో సెలబ్రిటీలు వారిని కలుస్తున్నారు. గురువారం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రముఖులు కలుసుకొని తమ విరాళాలను అందజేశారు. ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం బాలకృష్ణ (Balakrishna) సహా యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ కూడా ఉన్నారు. బాలయ్య ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రకటించిన రూ. 50 లక్షల చెక్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు, మరి సిద్దు, విశ్వక్సేన్ వారు ప్రకటించిన విరాళాలను కూడా బాలయ్య సమక్షంలో అందజేశారు.