Posted by pallavi on 2024-09-13 20:40:21 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 34
సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీతారాం ఏచూరి నివాసానికి నేరుగా బయలుదేరారు. ఏచూరి పార్ధివదేహానికి సిఎంతోపాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అప్పల నాయుడు, కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, రవీంద్ర కుమార్ శ్రద్ధాంజలి ఘటించారు.