Posted by pallavi on 2024-09-13 20:52:45 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 22
బెంగళూరు, సెప్టెంబర్ 13: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో నాగమంగళ పట్టణంలో నవరాత్రుల సందర్భంగా వినాయకుడి ఊరేగింపు సమయంలో మత ఘర్షణలు తలెత్తడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. వినాయకుడి ఊరేగింపు సందర్భంలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే, నిఘా విభాగం సైతం విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.