తెలంగాణ డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు: శాంతిభద్రతల భంగం విషయంలో కఠిన చర్యలు

తెలంగాణ తెలంగాణ

Posted by pallavi on 2024-09-13 21:07:04 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 72


తెలంగాణ డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు: శాంతిభద్రతల భంగం విషయంలో కఠిన చర్యలు

హైదరాబాద్: శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ డీజీపీ జితేందర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎవరైనా ఉన్నా, వారికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ మరియు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను నష్టపరిచే రాజకీయ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో కూడా सहించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని పడగొడతామని పదేపదే చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అన్నారు. అయితే, కేసీఆర్ లక్కీ నెంబర్ తమ వద్ద ఉన్నందున, తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుల విషయంలో స్పీకర్‌నే తుది నిర్ణయాన్ని తీసుకుంటారని, స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారని తెలిపారు.

Search
Categories