తెలుగుదేశం పార్టీ: దేశ నిర్మాణంలో ప్రభావవంతమైన ప్రయాణం

మన విజయాలు భారతదేశం

Posted by pallavi on 2024-09-16 09:53:46 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 83


తెలుగుదేశం పార్టీ: దేశ నిర్మాణంలో ప్రభావవంతమైన ప్రయాణం

భారత రాజకీయాల్లోనే కాకుండా పాలకుల దృక్పథంలోనూ తెలుగుదేశం పార్టీ (టిడిపి) ప్రతిపాదించిన మార్పులు పెను ప్రభావాన్ని చూపాయి. "రాజకీయం అంటే అధికారం వినియోగించడం కాదు, ప్రజల భవిష్యత్తును మెరుగుపర్చే మార్గంలో అధికారాన్ని వినియోగించాలి" అని ఎన్టీఆర్ ధైర్యంగా ప్రకటించారు. ఈ విధంగా ఆయన ప్రజలను చైతన్యవంతం చేసి, రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో ఉండాల్సిన సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. ఆ చైతన్యం క్రమంగా ఇతర రాష్ట్రాలకు వ్యాపించి, రథయాత్రలు, పాదయాత్రల ద్వారా నాయకత్వం ప్రజల దృష్టిలోకి చేరింది.

సంక్షేమ పాలనకు శ్రీకారం:

"పేదలకు పట్టెడన్నం పెట్టగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం" అంటూ ఎన్టీఆర్ అమలు చేసిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం వంటి సంక్షేమ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ తీసుకువచ్చిన మండల వ్యవస్థ, స్త్రీలకు ఆస్తి హక్కు వంటి నిర్ణయాలు అనేక సామాజిక మార్పులకు, పాలనా సంస్కరణలకు దారితీశాయి.

చంద్రబాబు నాయకత్వం:

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆర్థిక సంస్కరణలు, విద్యుత్ రంగం మార్పులు దేశానికి కొత్త మార్గాన్ని చూపాయి. సంపద సృష్టి అన్న పదం ఆయన్ను దేశ రాజకీయ నాయకులనే కాకుండా ఆర్థికవేత్తల మరియు పారిశ్రామికవేత్తల దృష్టిలో నిలిపింది. ఆయన ఈ-గవర్నెన్స్, టెలికాం సంస్కరణలు, నేషనల్ ఐటీ ప్యానెల్ చైర్మన్‌గా దేశ ఐటీ రంగంలో తన ముద్ర వేశారు.

స్వర్ణ చతుర్భుజి:

భారతదేశంలో విశాలమైన జాతీయ రహదారులు నిర్మించాలని చంద్రబాబు ప్రతిపాదించారు, దీని ఫలితంగా 'స్వర్ణ చతుర్భుజి' పథకం ప్రారంభమైంది. 

నదుల అనుసంధానం:

గంగా-కావేరి నదుల అనుసంధాన ప్రతిపాదనను తిరిగి వాజపేయి ముందుకు తెచ్చిన చంద్రబాబు, 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి దేశంలో మొదటి నదుల అనుసంధానాన్ని చేశారు.

ఇలా, నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ దేశ నిర్మాణంలో కీలక మలుపులను తీసుకువచ్చింది.

Search
Categories