Posted by pallavi on 2024-09-13 13:15:01 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 39
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఇటీవల ఉప్పొంగుతోంది. మూడు రోజులుగా ఛత్తీస్గఢ్తోపాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతం ఎత్తుగా ఒరవడి ప్రదర్శిస్తోంది. 50 అడుగుల ఎత్తు నుండి జాలువారుతూ పాలసంద్రంలా మారి, కనువిందు చేస్తోంది. ఈ అందాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. అయితే, భారీ వర్షాలు మరియు వరద ఉధృతి పెరిగిపోతుండటంతో, జలపాతం సందర్శనను నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారులు ప్రకటించారు. నేటి నుంచి బొగత సందర్శనకు అనుమతి లేదని ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపారు.