Posted by pallavi on 2024-09-13 20:30:10 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 70
ఒలింపియాడ్లో రెండో రౌండ్లో భారత పురుషుల జట్లు, మహిళల జట్లు విజయాలను సాధించాయి. గురువారం జరిగిన ఈ రౌండ్లలో, పురుషుల జట్టు ఐస్లాండ్ను 4-0 తేడాతో ఓడించగా, మహిళల జట్టు చెక్ రిపబ్లిక్ను 3.5-0.5తో పరాజయానికి గురి చేసింది. పురుషుల్లో అర్జున్ ఇరిగేసి స్టెఫాన్స్పై, హరికృష్ణ గ్రేటర్సన్పై, గుకేష్ వాట్నర్పై, విదిత్ గుజ్రాతి హిల్మిర్పై విజయాలు సాధించారు. మహిళల్లో హారిక జూలియాపై, దివ్యా దేశ్ముఖ్ నటాలీపై, వంతిక అగర్వాల్ టెరెజాపై విజయం సాధించగా, తానియా సచ్దేవ్-మార్టినా ఆట డ్రా అయ్యింది. రెండో రౌండ్ అనంతరం, భారత పురుషులు మరియు మహిళలు నాలుగేసి పాయింట్లతో కొనసాగిస్తున్నారు.