భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టులో జాకర్‌ అలీ ఎంపిక

క్రీడలు క్రీడలు

Posted by pallavi on 2024-09-13 20:35:03 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 68


భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టులో జాకర్‌ అలీ ఎంపిక

భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ జట్టులో అన్‌క్యాప్డ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జాకర్‌ అలీకి చోటు దక్కింది. గాయపడిన పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం మినహా, పాకిస్థాన్‌పై 2-0తో సిరీస్‌ గెలిచిన జట్టును యథాతథంగా ఎంపిక చేశారు. అయితే, పేసర్‌ స్థానంలో వికెట్‌కీపర్‌ జాకర్‌ అలీకి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. నజ్ముల్‌ హొస్సేన్‌ షంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 19న చెన్నైలో తొలి టెస్ట్‌ మరియు 27న కాన్పూర్‌లో రెండో టెస్ట్‌ జరుగుతాయి.

Search
Categories